Skip to main content

YS SHARMILA Garu For the first time after taking charge as AP Congress President, Meet Telangana State Chief Minister and PCC Chief Revanth Reddy garu were politely discussed on various political issues.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానని శపథం చేసిన వైఎస్ షర్మిల ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో వైసీపీని చావు దెబ్బ కొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డి తో చర్చించినట్టు తెలుస్తుంది. 

ఆంధ్రధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

.

 వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టక ముందు జవసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. 

వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న షర్మిల తాజాగా వేస్తున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఒకపక్క పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతోపాటు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసిపి పాలనను టార్గెట్ చేస్తూ జిల్లాల పర్యటనలలో షర్మిల నిప్పులు చెరుగుతున్నారు

 పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడారు. 

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైయస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాలని కోరినట్టు సమాచారం. 

అంతేకాదు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం కూడా రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్టు సమాచారం.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో ఫాలో అయిన సక్సెస్ మంత్ర ఏమిటి అన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

Pranamillina in the paved area Chandrababu AP CM Chandrababu in Amaravati Traveling Neglected under the YCP regime Many constructions and conditions of the capital region

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. YCP పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం*  హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.  8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు.  ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో స...

Today all political parties are talking about women empowerment. But the respective political parties are not giving proper priority to women.

మహిళా రిజర్వేషన్‌తోనే సాధికారత సాధ్యం నేడు మహిళా సాధికారత గూర్చి అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడు తున్నాయి. కానీ మహిళలకు ఆయా రాజకీయ పక్షాలు సముచితమైన ప్రాధాన్యతను ఇవ్వటం లేదు.  నేటికి మహిళలను వంట ఇంటికే పరిమితం చేస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ నేటికీ మనుస్మృతిని ప్రామాణికంగా భావిస్తున్నది.  స్త్రీల హక్కుల పట్ల చులకనభావం చూపిస్తున్నది. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పదని ప్రచారం చేస్తున్నది. కానీ మనుస్మృతి మహిళలను అంటరానివారిగా భావించి వారికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వాంఛనీయం కాదని చెబుతున్నది.  ఆధునిక ప్రపంచంలోనూ మహిళలు అన్ని రంగాలలో వివక్షతకు గురవుతున్నారు. అన్ని దేశాలలో ఈ వివక్షత కొనసాగుతున్నది. భూమి, ఆకాశం, సముద్రగర్భంలో అన్ని రంగాలలో నేడు పురుషులో సమానంగా మహిళలు పనిచేస్తున్నారు.  పోటీ పడుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశం నుండి దేశ అధ్యక్ష పదవికి ఒక భారతీయ మూలం ఉన్న మహిళ పోటీపడటం మనకు గర్వకారణం.  విద్య, వైద్య, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారు. రక్షణరంగం, విమానయాన రంగం, అంతరిక్షరంగం, షిప్పింగ్‌ వంటి రంగా...