Skip to main content

YS SHARMILA Garu For the first time after taking charge as AP Congress President, Meet Telangana State Chief Minister and PCC Chief Revanth Reddy garu were politely discussed on various political issues.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానని శపథం చేసిన వైఎస్ షర్మిల ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో వైసీపీని చావు దెబ్బ కొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డి తో చర్చించినట్టు తెలుస్తుంది. 

ఆంధ్రధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

.

 వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టక ముందు జవసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. 

వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న షర్మిల తాజాగా వేస్తున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఒకపక్క పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతోపాటు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసిపి పాలనను టార్గెట్ చేస్తూ జిల్లాల పర్యటనలలో షర్మిల నిప్పులు చెరుగుతున్నారు

 పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడారు. 

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైయస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాలని కోరినట్టు సమాచారం. 

అంతేకాదు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం కూడా రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్టు సమాచారం.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో ఫాలో అయిన సక్సెస్ మంత్ర ఏమిటి అన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...

CHETAN KRISHNA HEBBA PATEL DUM DHAM POSTER FIRST LOOK | #factclubofficial

*చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్* చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఇవాళ "ధూం ధాం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్ ఆన్ లొకేషన్ లో రిలీజ్ చేశారు. పెళ్లి బారాత్ లో హీరో హీరోయిన్స్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా "ధూం ధాం" సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. నటీనట...

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం*  హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.  8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు.  ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో స...