Skip to main content

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం* 
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.

1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.

 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు.

ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం..

ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.

 పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. 

ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో సహాయంతో ట్యాపింగ్‌ని విస్తృతం చేశామన్నారు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించారు. 

రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశామన్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్‌ని ఆఫ్ చేశామని ప్రణీత్ రావు తెలిపారు.

సెల్‌‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశాం..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారని ప్రణీత్ రావు వెల్లడించారు. 

ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టైపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించారని తెలిపారు. 

ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకువచ్చామన్నారు. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్ చేశామన్నారు. 

17 హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలకమైన సమాచారం ఉందన్నారు. 17 హార్డ్ డిస్క్ లను కట్టర్‌తో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. 

పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్‌తో ఐడీపీఆర్ డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసినట్టు ప్రణీత్ రావు వెల్లడించారు. పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామన్నారు. 

ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లన్నింటినీ కూడా నాగోల్ మూసారంబాగ్ మూసిలో పడవేసినట్టు తెలిపారు. ఫార్మాట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేసినట్టు ప్రణీత్ రావు తెలిపారు.. కేపి

Comments

Popular posts from this blog

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...

CHETAN KRISHNA HEBBA PATEL DUM DHAM POSTER FIRST LOOK | #factclubofficial

*చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్* చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఇవాళ "ధూం ధాం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్ ఆన్ లొకేషన్ లో రిలీజ్ చేశారు. పెళ్లి బారాత్ లో హీరో హీరోయిన్స్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా "ధూం ధాం" సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. నటీనట...