Skip to main content

*Hero Raj Tarun in entanglements...Heroine Lavanya was caught in drugs who complained in the piece that he had cheated*

*చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్....మోసం చేసాడు అంటూ పీస్ లో ఫిర్యాదు చేసిన డ్రగ్స్ లో పట్టుబడ్డ ..హీరోయిన్ లావణ్య*
హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. 

ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. 

పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.

 తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

 తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది.

 సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. 

రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది. 

తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది.  

3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది.

లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా. ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించారు.

 అయితే మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది.

అంతేకాదు, హిమాచల్‌ ప్రదేశ్‌ CM తమ నాన్నకు ఫ్రెండ్‌ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది.

 మాల్వీ ట్రాప్‌లో పడి, రాజ్‌తరుణ్‌ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. 

కానీ తాను రాజ్‌తరుణ్‌ లేకపోతే ఉండలేనంటోంది. తాను రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని కోరుకుంటోంది.

Comments

Popular posts from this blog

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...

CHETAN KRISHNA HEBBA PATEL DUM DHAM POSTER FIRST LOOK | #factclubofficial

*చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్* చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఇవాళ "ధూం ధాం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్ ఆన్ లొకేషన్ లో రిలీజ్ చేశారు. పెళ్లి బారాత్ లో హీరో హీరోయిన్స్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా "ధూం ధాం" సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. నటీనట...

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం*  హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.  8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు.  ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో స...