Skip to main content

వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా?

video footage

వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా?

ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది. అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు


ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదంటున్న యూపీ పోలీస్‌
వారణాసి: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది.

 
అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు. కొందరు మొబైల్‌ అని చెబుతున్నారు. యూపీ పోలీసులు మాత్రం అది ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదని వివరణ ఇస్తున్నారు. 

వారణాసి ఎంపీగా గెలిచిన మోదీకి గత రెండు పర్యాయాలతో పోల్చితే భారీగా మెజార్టీ తగ్గిపోయిన విషయం తెలిసిందే. మోదీ వాహనం వెళుతుండగా.. 

రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఏదో గుర్తు తెలియని వస్తువు మోదీ ప్రయాణిస్తున్న కారుపై పడటం..

 వెంటనే కారు బానెట్‌పై ఉన్న ఆయన అంగరక్షకుడు దానిని తీసి అవతలపడేయటం ఒక వీడియోలో కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ వస్తువు ఏంటనే అంశంలో చర్చ నడుస్తున్నది. భారీ భద్రత మధ్య ఉండే ప్రధాని కాన్వాయ్‌పైకి వస్తువును ఎలా విసిరారు? ఎవరు విసిరారు? అనే అంశం తేలాల్సి ఉన్నది. 

అయితే ఆ వీడియో సరైందేనా? అన్నది కూడా తెలియాల్సి ఉన్నది. మోదీ కాన్వాయ్‌ దశాశ్వమేధ ఘాట్‌ నుంచి కేవీ మందిర్‌కు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. 1.41 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో 19 సెకన్ల భాగంలో పక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తి.. చెప్పు విసిరారు..

 అంటూ అరవడం వినిపిస్తున్నది. ఆ వెంటనే ఐదు లేదా ఆరు సెకన్ల వ్యవధిలో పీఎం భద్రతా సిబ్బంది తన చేత్తో దానిని పట్టుకుని పక్కకు విసిరేయడం కనిపిస్తున్నది.


అయితే.. అది చెప్పు కాదని, మొబైల్‌ ఫోన్‌ అని పేరు రాయడానికి నిరాకరించిన యూపీ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు.

 ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కాకపోతే మొబైల్‌ ఫోన్‌ ఎందుకు విసిరి ఉంటారన్న ప్రశ్నకు ఆయన జవాబు చెప్పలేదు.

 ఇది మోదీ కన్వాయ్‌లో భద్రతా లోపమా? అన్న విషయానికి కూడా ఆయన వివరణ ఇవ్వలేదు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 20వేల కోట్ల రూపాయలను 17వ విడుత కింద విడుదల చేసే కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. 

ఈ నిధులు 9.26 కోట్ల మంది రైతులకు ఉద్దేశించారు. మోదీకి వారణాసిలో 2019 ఎన్నికల్లో 4.8 లక్షల మెజార్టీ రాగా.. 2024 ఎన్నికల్లో 1,52,513 మెజార్టీ మాత్రమే లభించింది. 

మోదీ వాహనంపైకి ఒక వస్తువు పడటం అనేది ఇదే మొదటిసారి. గతంలో మోదీ పాల్గొన్న కొన్ని కార్యక్రమాల్లో ఆయన వ్యతిరేకులు నల్ల దుస్తులు ధరించి నిరసనలకు ప్రయత్నించినా.. భద్రతా సిబ్బంది వారిని అనుమతించలేదు.

Comments

Popular posts from this blog

Pranamillina in the paved area Chandrababu AP CM Chandrababu in Amaravati Traveling Neglected under the YCP regime Many constructions and conditions of the capital region

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. YCP పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం*  హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.  8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు.  ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో స...

Today all political parties are talking about women empowerment. But the respective political parties are not giving proper priority to women.

మహిళా రిజర్వేషన్‌తోనే సాధికారత సాధ్యం నేడు మహిళా సాధికారత గూర్చి అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడు తున్నాయి. కానీ మహిళలకు ఆయా రాజకీయ పక్షాలు సముచితమైన ప్రాధాన్యతను ఇవ్వటం లేదు.  నేటికి మహిళలను వంట ఇంటికే పరిమితం చేస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ నేటికీ మనుస్మృతిని ప్రామాణికంగా భావిస్తున్నది.  స్త్రీల హక్కుల పట్ల చులకనభావం చూపిస్తున్నది. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పదని ప్రచారం చేస్తున్నది. కానీ మనుస్మృతి మహిళలను అంటరానివారిగా భావించి వారికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వాంఛనీయం కాదని చెబుతున్నది.  ఆధునిక ప్రపంచంలోనూ మహిళలు అన్ని రంగాలలో వివక్షతకు గురవుతున్నారు. అన్ని దేశాలలో ఈ వివక్షత కొనసాగుతున్నది. భూమి, ఆకాశం, సముద్రగర్భంలో అన్ని రంగాలలో నేడు పురుషులో సమానంగా మహిళలు పనిచేస్తున్నారు.  పోటీ పడుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశం నుండి దేశ అధ్యక్ష పదవికి ఒక భారతీయ మూలం ఉన్న మహిళ పోటీపడటం మనకు గర్వకారణం.  విద్య, వైద్య, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారు. రక్షణరంగం, విమానయాన రంగం, అంతరిక్షరంగం, షిప్పింగ్‌ వంటి రంగా...