Skip to main content

వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా?

video footage

వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా?

ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది. అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు


ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదంటున్న యూపీ పోలీస్‌
వారణాసి: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది.

 
అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు. కొందరు మొబైల్‌ అని చెబుతున్నారు. యూపీ పోలీసులు మాత్రం అది ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదని వివరణ ఇస్తున్నారు. 

వారణాసి ఎంపీగా గెలిచిన మోదీకి గత రెండు పర్యాయాలతో పోల్చితే భారీగా మెజార్టీ తగ్గిపోయిన విషయం తెలిసిందే. మోదీ వాహనం వెళుతుండగా.. 

రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఏదో గుర్తు తెలియని వస్తువు మోదీ ప్రయాణిస్తున్న కారుపై పడటం..

 వెంటనే కారు బానెట్‌పై ఉన్న ఆయన అంగరక్షకుడు దానిని తీసి అవతలపడేయటం ఒక వీడియోలో కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ వస్తువు ఏంటనే అంశంలో చర్చ నడుస్తున్నది. భారీ భద్రత మధ్య ఉండే ప్రధాని కాన్వాయ్‌పైకి వస్తువును ఎలా విసిరారు? ఎవరు విసిరారు? అనే అంశం తేలాల్సి ఉన్నది. 

అయితే ఆ వీడియో సరైందేనా? అన్నది కూడా తెలియాల్సి ఉన్నది. మోదీ కాన్వాయ్‌ దశాశ్వమేధ ఘాట్‌ నుంచి కేవీ మందిర్‌కు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. 1.41 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో 19 సెకన్ల భాగంలో పక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తి.. చెప్పు విసిరారు..

 అంటూ అరవడం వినిపిస్తున్నది. ఆ వెంటనే ఐదు లేదా ఆరు సెకన్ల వ్యవధిలో పీఎం భద్రతా సిబ్బంది తన చేత్తో దానిని పట్టుకుని పక్కకు విసిరేయడం కనిపిస్తున్నది.


అయితే.. అది చెప్పు కాదని, మొబైల్‌ ఫోన్‌ అని పేరు రాయడానికి నిరాకరించిన యూపీ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు.

 ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కాకపోతే మొబైల్‌ ఫోన్‌ ఎందుకు విసిరి ఉంటారన్న ప్రశ్నకు ఆయన జవాబు చెప్పలేదు.

 ఇది మోదీ కన్వాయ్‌లో భద్రతా లోపమా? అన్న విషయానికి కూడా ఆయన వివరణ ఇవ్వలేదు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 20వేల కోట్ల రూపాయలను 17వ విడుత కింద విడుదల చేసే కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. 

ఈ నిధులు 9.26 కోట్ల మంది రైతులకు ఉద్దేశించారు. మోదీకి వారణాసిలో 2019 ఎన్నికల్లో 4.8 లక్షల మెజార్టీ రాగా.. 2024 ఎన్నికల్లో 1,52,513 మెజార్టీ మాత్రమే లభించింది. 

మోదీ వాహనంపైకి ఒక వస్తువు పడటం అనేది ఇదే మొదటిసారి. గతంలో మోదీ పాల్గొన్న కొన్ని కార్యక్రమాల్లో ఆయన వ్యతిరేకులు నల్ల దుస్తులు ధరించి నిరసనలకు ప్రయత్నించినా.. భద్రతా సిబ్బంది వారిని అనుమతించలేదు.

Comments

Popular posts from this blog

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...

CHETAN KRISHNA HEBBA PATEL DUM DHAM POSTER FIRST LOOK | #factclubofficial

*చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్* చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఇవాళ "ధూం ధాం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్ ఆన్ లొకేషన్ లో రిలీజ్ చేశారు. పెళ్లి బారాత్ లో హీరో హీరోయిన్స్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా "ధూం ధాం" సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. నటీనట...

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం*  హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.  8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు.  ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో స...