Skip to main content

CRAZY MAN ENTERS INTO LIONS DEN | LOIN ATTACKED A MAN | IN TIRUPATHI ZOO PARK THE VICTIM IS FROM RAJASTHAN PRAHLAD GUJJAR 38Yrs Old...

తిరుపతి : factclub 


పులితో సెల్ఫీ దిగాలనుకో.. కొంచెం రిస్క్‌ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని ఆటాడాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’.

 ఇది ఓ సినిమాలోని డైలాగ్‌ ఇది.. కానీ.. ఓ వ్యక్తి.. అచ్చం అలాంటి డైలాగ్ ని తలపించేలా.. సింహంతో ట్రై చేశాడు.. అడవి రాజైన సింహం.

అంటే మామూలుగా ఉంటదా.. ఏంటి..? సింహంతో పరాచికాలాడి చావును కొనితెచ్చుకున్నాడు.. సెల్ఫీ కోసం ట్రై చేసిన ఆ వ్యక్తి ప్రాణాన్ని క్షణాల్లో తీసేసింది సింహం.

ఈ షాకింగ్ ఘటన తిరుపతి శ్రీవెంకటేశ్వర జూలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జార్‌ (38) అనే వ్యక్తి.. తిరుపతి శ్రీవెంకటేశ్వర జూకి వచ్చాడు.. వచ్చి రాగానే అక్కడ తిరుగుతూ.. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు.

 సెల్ఫీ కోసం సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి.. దర్జాగా సెల్ఫీ తీసుకున్నాడు.. ఆ తర్వాత ఏదో సాధించినట్లు తొడకూడా కొట్టాడు.. సింహం కదిలేసరికి.. గుర్జార్.. చెట్టు ఎక్కి కూర్చున్నాడు..

 కాసేపటికి అదుపుతప్పి చెట్టుపై నుంచి కిందపడటంతో ఆ వ్యక్తిపై రెప్పపాటులో సింహం దాడిచేసింది. సింహం అతనిపై దాడి చేసి శరీరాన్ని చీల్చీవేసింది.

ఈ దాడి ఘటన అనంతరం.. జంతుప్రదర్శనశాల అధికారులు అక్కడికి చేరుకుని.. సింహాన్ని బోన్‌లో బంధించారు. 

ప్రస్తుతం జూ దగ్గర ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. జూలోకి సిబ్బంది ఎవర్నీ అనుమతించడం లేదు..

Comments

Popular posts from this blog

Pranamillina in the paved area Chandrababu AP CM Chandrababu in Amaravati Traveling Neglected under the YCP regime Many constructions and conditions of the capital region

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. YCP పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం*  హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.  8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు.  ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో స...

Today all political parties are talking about women empowerment. But the respective political parties are not giving proper priority to women.

మహిళా రిజర్వేషన్‌తోనే సాధికారత సాధ్యం నేడు మహిళా సాధికారత గూర్చి అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడు తున్నాయి. కానీ మహిళలకు ఆయా రాజకీయ పక్షాలు సముచితమైన ప్రాధాన్యతను ఇవ్వటం లేదు.  నేటికి మహిళలను వంట ఇంటికే పరిమితం చేస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ నేటికీ మనుస్మృతిని ప్రామాణికంగా భావిస్తున్నది.  స్త్రీల హక్కుల పట్ల చులకనభావం చూపిస్తున్నది. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పదని ప్రచారం చేస్తున్నది. కానీ మనుస్మృతి మహిళలను అంటరానివారిగా భావించి వారికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వాంఛనీయం కాదని చెబుతున్నది.  ఆధునిక ప్రపంచంలోనూ మహిళలు అన్ని రంగాలలో వివక్షతకు గురవుతున్నారు. అన్ని దేశాలలో ఈ వివక్షత కొనసాగుతున్నది. భూమి, ఆకాశం, సముద్రగర్భంలో అన్ని రంగాలలో నేడు పురుషులో సమానంగా మహిళలు పనిచేస్తున్నారు.  పోటీ పడుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశం నుండి దేశ అధ్యక్ష పదవికి ఒక భారతీయ మూలం ఉన్న మహిళ పోటీపడటం మనకు గర్వకారణం.  విద్య, వైద్య, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారు. రక్షణరంగం, విమానయాన రంగం, అంతరిక్షరంగం, షిప్పింగ్‌ వంటి రంగా...